పార్టీ ఆలోచనలు తన ఆలోచనలకు భిన్నంగా ఉన్నందువల్లే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ తెలిపారు. అయితే అమరావతి రైతుల బాధలను స్వయంగా చూశానని, వారికి అండగా ఉంటానని స్పష్టం చేశారు.
పార్టీకి తనకు మధ్య విభేదాలు ఎక్కడ వచ్చాయో స్పష్టంగా చెప్పలేదు కానీ మిగతా విషయాలన్నీ త్వరలోనే తెలుస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. శాసనమండలిని రద్దు చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. మండలి అనేది ఒక వ్యవస్థ అని దాన్ని రద్దు చేయడం కరెక్టు కాదని ఆయన అన్నారు.