సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని అడ్డరోడ్డు సెంటర్ నందు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తండు సాయిరాం గౌడ్ ఆధ్వర్యంలో టిడిపి 39 వసంతాలు నిండి 40వ,వసంతంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర TNTUC ఉపాధ్యక్షుడు చావా సహదేవరావు (చిన్నా) హాజరయ్యారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం సహదేవరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అన్న NTR 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారని, పార్టీ ఆవిర్భవించిన తొమ్మిది మాసాలలోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందని అన్నారు.భారతదేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన పార్టీ టిడిపి అని కొనియాడారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మిఠాయిలు పంచుకొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యదర్శి నలమద శ్రీనివాస్ యాదవ్, పార్లమెంటు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ రొమజోగి గౌడ్, రాష్ట్ర బిసి సెల్ కార్యదర్శి ఎలక వెంకటేశ్వర్లు గౌడ్, పార్లమెంటు తెలుగు యువత ప్రధాన కార్యదర్శి చల్లా వంశీ,గొట్టె రాము,రావిరాల లింగయ్య, పొందూరి సత్యనారాయణ, అయిల వెంకన్న గౌడ్,శీలం వెంకన్న, మేకల వెంకటేశ్వర్లు, కొత్తపల్లి వెంకటనారాయణ, పుల్లారెడ్డి, చిట్యాల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.