పశ్చిమగోదావరిజిల్లా ఏలూరు లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని టిడిపి నాయకులు సోమవారం ఘనంగా జరుపుకున్నారు.తె లుగుదేశంపార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు కు జిల్లాలో ని నగరాలలో, పట్టణాలలో, గ్రామాలలో టిడిపి శ్రేణులు ఘనమైన నివాళులు అర్పించారు.
తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచదేశాల కు తెలియజేసిన మహోన్నతమైన గుర్తింపు తెచ్చిన ఘనత స్వర్గీయ ఎం టి రామారావుకు దక్కుతుందని వక్తలు కొనియాడారు. ఆయన చిత్ర పటాల పైనా, ఆయన కాంస్య విగ్రహాల పైన పూలు జల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
సినీ రంగం నుండి రాజకీయాలలో కి వచ్చి తెలుగు ప్రభంజనం సృష్టించి ముఖ్యమంత్రిగా అఖండ విజయాలు సాధించి తెలుగు ప్రజల రైతుల అభివృద్ధికి ఎనలేని కృషిచేశారని ఎన్ టి ఆర్ రాజకీయ సేవలను స్మరించుకున్నారు. జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం .జై ఎన్ టి ఆర్. జై జై ఎ న్ టి ఆర్ అంటూ నినదించారు.