39.2 C
Hyderabad
April 25, 2024 17: 17 PM
Slider పశ్చిమగోదావరి

పశ్చిమగోదావరిలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

#TDPWestGodavari

పశ్చిమగోదావరిజిల్లా ఏలూరు లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని టిడిపి నాయకులు సోమవారం ఘనంగా జరుపుకున్నారు.తె లుగుదేశంపార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు కు  జిల్లాలో ని నగరాలలో, పట్టణాలలో, గ్రామాలలో టిడిపి శ్రేణులు ఘనమైన నివాళులు అర్పించారు.

తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచదేశాల కు తెలియజేసిన మహోన్నతమైన గుర్తింపు తెచ్చిన ఘనత స్వర్గీయ ఎం టి రామారావుకు దక్కుతుందని వక్తలు కొనియాడారు. ఆయన  చిత్ర పటాల పైనా, ఆయన కాంస్య విగ్రహాల పైన పూలు జల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

సినీ రంగం నుండి రాజకీయాలలో కి వచ్చి తెలుగు ప్రభంజనం సృష్టించి ముఖ్యమంత్రిగా అఖండ విజయాలు సాధించి తెలుగు ప్రజల రైతుల అభివృద్ధికి ఎనలేని కృషిచేశారని ఎన్ టి ఆర్  రాజకీయ సేవలను స్మరించుకున్నారు. జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం .జై ఎన్ టి ఆర్. జై జై ఎ న్ టి ఆర్ అంటూ నినదించారు.

Related posts

ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా లక్షణాలు

Satyam NEWS

సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేష్ ఇక లేరు

Satyam NEWS

మంచిగా ఉన్న రోడ్డునే తవ్వి మళ్లీ వేశారు

Satyam NEWS

Leave a Comment