37.2 C
Hyderabad
March 29, 2024 19: 40 PM
Slider అనంతపురం

మగ్గం తగలబెట్టిన చేనేత కార్మికునికి టీడీపీ చేయుత

#Nimmala Kistappa MP

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను నిర్లక్ష్యానికి గురి చేస్తూ వారికి అన్యాయం చేస్తోందని హిందూపురం మాజీ పార్లమెంట్ సభ్యులు  నిమ్మల కిష్టప్ప అన్నారు. సొంత పార్టీ కార్యకర్తల కోసమే అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్న నేస్తం కార్యక్రమానికి నిరసనగా తమ మగ్గాన్ని తానే కాల్చేశాడు నేత కార్మికుడు కాలా ఆచారి.

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం బాలాంపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనను తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు హిందూపురం మాజీ పార్లమెంట్ సభ్యులు  నిమ్మల కిష్టప్ప ఆర్థిక సహాయం అందించారు. ఆ గ్రామ పరిధిలో ఉన్నకుల వృత్తుల అందరితో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు.

పక్ష పాతంతో వ్యవహరిస్తున్న ప్రభుత్వంపైన బడుగు బలహీనవర్గాలు, దళితులు, మైనార్టీ సోదరులు గళం విప్పాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు.

రాబోయే రోజుల్లో పార్లమెంటు పరిధిలోని గ్రామాలలో తిరిగి తెలుగుదేశం పార్టీని మరలా అధికారంలో తీసుకురావడానికి ప్రతి కార్యకర్త నీ కలుపుకొని పునరంకిత మై పార్టీకి పూర్వ వైభవం సాధిస్తానని ప్రజలకు తెలియజేసారు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా బలహీనవర్గాల పైన దాడులను మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Related posts

సిబిఐటి కళాశాల లో  జాతీయ సైన్స్ దినోత్సవం

Satyam NEWS

జర్నలిస్టు మృతితో ఇమ్రాన్ ఖాన్ లాంగ్ మార్చ్ రద్దు

Satyam NEWS

పోలీసు అమ‌ర‌వీరుల దినోత్స‌వం సంద‌ర్బంగా ఓపెన్ హ‌స్…!

Satyam NEWS

Leave a Comment