ఇటీవల మరణించిన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ టీడీపీ సోషల్ మీడియా కన్వీనర్ పసరకొండ శ్రీనివాస శర్మ కుటుంబానికి ఎన్.ఆర్.ఐ టిడిపి ఆధ్వర్యంలో రూ.2 లక్షల 73 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షురాలు సీతారామ లక్ష్మి మాట్లాడుతూ పసరకొండ శ్రీనివాస్ శర్మ ఎన్టీఆర్ అభిమాని గా తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో పార్టీ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటూ తక్కువ వ్యవధిలోనే నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ గా పని చేస్తున్నారని అన్నారు.
ఆయన గుండెపోటుతో మరణించడం పార్టీకి తీరని లోటని వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు. అలాగే వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో, ప్రపంచంలోని తెలుగుదేశం పార్టీ అభిమానులలో మంచి స్థానాన్ని సంపాదించుకున్న శ్రీనివాస్ శర్మ కుటుంబానికి ఎన్ఆర్ఐ టిడిపి తరఫున ఆర్థిక సహాయం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ శర్మ కుటుంబ సభ్యులతో పాటు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మెంటే కాశీ విశ్వేశ్వర రావు,( గోపి) పట్టణ ప్రధాన కార్యదర్శి ఉప్పులూరి చంద్రశేఖర్, పట్టణ వాణిజ్య విభాగం అధ్యక్షుడు ఎం.గుణేశ్వర రావు, sk ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మెంటే పార్థసారధి పంపించిన రూ 5000 ఆర్థిక సహాయం మెంటే కాశీవిశ్వేశ్వర రావు అందజేశారు.