రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిద్ధమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు సందర్భంగా రాజమండ్రి నగరం పసుపుమయం అయింది. టీడీపీ నేతలు, కార్యకర్తలతో సందడిగా మారింది. కార్యక్రమానికి 15 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. తొలి రోజున ప్రతినిధుల సభకు 40 వేల మంది కార్యకర్తలు హాజరయ్యారు.
మహానాడులో అధ్యక్ష ఉపన్యాసం చేసిన చంద్రబాబు తమ పార్టీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉందని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళిక ముసాయిదాను వెల్లడిస్తామని, దానిపై ప్రజల్లో చర్చ పెట్టిన తర్వాత తుది రూపం ఇస్తామని చెప్పారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సగర్వంగా నిలబెడతామని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో జరిపిన అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మెరుగైన రాష్ట్రంగా ముందుకు వెళుతున్నదని, సైకో పానలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత నాలుగేళ్లలో అథ:పాతాళానికి వెళ్లిందని చంద్రబాబునాయుడు అన్నారు.