31.7 C
Hyderabad
April 19, 2024 00: 10 AM
Slider కృష్ణ

సూర్యారావు కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ నేత

#rajendraprasad

అనారోగ్యంతో ఇటీవల అకాలంగా మరణించిన సూర్యారావు కుటుంబాన్ని రాష్ట్ర తెదేపా ఉపాధ్యక్షులు బాబూ రాజేంద్ర ప్రసాద్ పరామర్శించారు. నేడు కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతీ 20 వార్డు సి. బి. యం కాంపౌండ్ లో సూర్య రావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.

ఈ సందర్బంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సూర్యారావు కుటుంబం తనకు అత్యంత సన్నిహితంగా ఉంటారని, వారి అబ్బాయి రాజబాబు ఎంతో అభిమానంగా ఉంటాడని అన్నారు. సూర్యారావు ఎన్నో సంవత్సరాలు సిబియం హాస్పటల్లో పనిచేసి పేద ప్రజలకు సేవలందించారని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. మంచి వ్యక్తిత్వం గల ఆయన ఈ రోజు మనల్ని వదిలి వెళ్లిపోవడం చాలా బాధాకారమని, వారి కుటుంబానికి ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పండ్రాజు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Related posts

జైమేడారం:హుండీ ఆదాయం రూ.5.63 లక్షలు

Satyam NEWS

కడపను చుట్టు ముట్టిన వరద నీరు

Sub Editor

రాష్ట్ర సగర సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Satyam NEWS

Leave a Comment