37.2 C
Hyderabad
March 28, 2024 19: 34 PM
Slider అనంతపురం

అధికారంలో ఉన్నా లేకున్నా ఆపన్నుల్ని ఆదుకుంటాం

#KalyanadurgamTDP

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని బ్రహ్మసముద్రం మండలంలో ఇటీవల కాలంలో వివిధ కారణాలతో మరణించిన కుటుంబాలను కలుసుకుని వారిని ఓదార్చారు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు.

చంద్రన్న స్పూర్తితో ఉమన్న సాయం  అంటూ ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు.

ఈ సందర్భంగా ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోయినా ప్రజల పక్షాన నిలిచి వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నారాయణ, తలారి సత్యప్ప, మురళి బ్రహ్మసముద్రం మండలం నాయకులు పాల్గొన్నారు.

కే లింగ ప్రసాద్

Related posts

నేడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం

Satyam NEWS

జాతీయ బ్యాంకుల ప్రవేటికరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ

Satyam NEWS

ఇళ్లను కాదు ఊళ్లనే కడుతున్నజ‌గ‌న్ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment