గత కొద్ది కాలంగా ప్రశాంతంగా ఉన్న పల్నాడు ప్రాంతంలో మళ్లీ ముఠా కక్షలు రెక్కలు విప్పాయి. తెలుగుదేశం పార్టీ నాయకుడిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేసి తమ పగ తీర్చుకున్నారు. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం లో జరిగిన ఈ టిడిపి నేత దారుణ హత్య ఈ ప్రాంతంలో సంచలనం కలిగించింది. వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ టిడిపి అధ్యక్షుడు తోట చంద్రయ్యను ప్రత్యర్ధులు కర్రలు, రాళ్లతో కొట్టి హత్యచేశారు. ఈ దారుణ హత్యతో ఆ ప్రాంతం మొత్తంలో భయాందోళనలు నెలకొన్నాయి.
previous post