జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి గా ఉన్న శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు… సిట్ అధికారి గా ఉన్న అభిషేక్ మహంతి లాంగ్ లీవ్ లో వెళ్లారు….ఈ విషయాలను కూడా వై ఎస్ జగన్ తల్లి విజయలక్ష్మి తన లేఖలో ప్రస్తావించి ఉంటే బాగుండేదని టీడీపి రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు.
జగన్ ప్రభుత్వ హయాంలో తనకు రక్షణ లేదని వివేకా కూతురు సునీత రక్షణ కోరారని ఆయన అన్నారు. మీ కుటుంబ సభ్యురాలిగా ఉన్న సునీత ప్రాణాలకే రక్షణ లేదని ఆయన అన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి పదే పదే సిట్ ను ఎందుకు మారుస్తున్నారో అర్థం కావడం లేదని సునీత పేర్కొన్నారని పట్టాభి గుర్తు చేశారు.
ఢిల్లీ సునీతా మీడియా సమావేశానికి ఎందుకు సాక్షి వాళ్ళు వెళ్ళలేదని పట్టాభి ప్రశ్నించారు. నిన్న సీఎం జగన్ తల్లి విజయమ్మ బహిరంగ లేఖ ను రాశారని, ఆనాటి గాంధారి కళ్ళకు గంతలు కట్టుకున్నట్లు ఉంది వైఎస్ విజయమ్మ తీరు…అని పట్టాభి తెలిపారు.
వివేకా హత్య గావింపపడ్డ కొన్ని గంటల్లోనే సిట్ విచారణకు చంద్రబాబు ఆదేశించారని పట్టాభి గుర్తు చేశారు. అయితే సీబీఐ విచారణ ను వెనక్కి తీసుకోవాలని జగన్ కోరిన మాట వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు.
జగన్ ముఖ్యమంత్రి అయిన 14 రోజుల్లోనే సిట్ ను మార్చేశారు…. వివేకా హత్య కేసు దోషులను కాపాడాలని జగన్ సిట్ ను మార్చారు……వివేకా కుమార్తె కడప ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ల పై అనుమానం వ్యక్తం చేసింది….. సొంతింటి లోనే వివేకా హత్య కేసు నిందితులు ఉన్నారని వివేకా కూతురు అనుమానం వ్యక్తం చేసింది..అని పట్టాభి గుర్తు చేశారు.
జగన్ కు వత్తాసు పలుకుతూ లేఖలు రాయడం విజయమ్మ మానుకోవాలని పట్టాభి కోరారు. గాంధారి అవతారం నుంచి విజయమ్మ బయటికి రావాలని ఆయన హితవు పలికారు. జగన్ దుర్యోధనుడి అవతారం లో దౌర్జన్యాలు చేస్తున్నారని వాటిని గుర్తించాలని పట్టాభి కోరారు.