కడపజిల్లా నందలూరు మండలలో మాజీ ఎమ్మెల్సీ, రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా టంగుటూరులో పురాతన శివలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆ ఊరి గ్రామస్తులు ఏడు సంవత్సరాల తరువాత నందలూరు ఏటిద్వారా ఊటకాలవకి సాగునీరు వస్తున్నాయని తెలిపారు. ఆ ఊటకాలవని తయారుచేయిస్తే టంగుటూరు రైతులకు 350 ఎకరాలకు సాగునీటిని అందించినవారు అవుతారని తెలిపారు.
అలాగే ఆ కాలువ మధ్యన ఇసుక తోలుకోవడానికి కొందరు వ్యక్తులు రోడ్డులాగా దారి ఏర్పరిచి కాల్వనుండి పొలాలకు నీటిని పోనివ్వకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వారికి గ్రామస్తులం అందరం చెప్పినా వినకపోవడమే కాకుండా అధికార పార్టీ అండచూసుకొని ప్రశ్నించిన వారిని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.
గ్రామంలో నుండి పగలనక రాత్రనక లారీలు, ట్రాక్టర్ల ద్వారా ఇసుక తోలడం వల్ల గ్రామస్తులకు చాలా ఇబ్బందికరంగా ఉందని ఆరోపించారు. ఇలా తమ సమస్యలను మండల స్థాయి అధికారులకి చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు బత్యాల తో తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు.
బత్యాల గ్రామస్తుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని వెంటనే పై సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా వారి సమస్యలను తెలిపి వాటిని పరిష్కరించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం టంగుటూరు గ్రామంలోని పలు ఆలయాలకు ప్రధాన పూజరిగా వ్యవహరిస్తున్న సుబ్బు స్వామి వారిని కలసి ఆయన వేదమంత్రాలతో అందజేసిన స్వామివారి ఆశీసులను,ప్రసాదాన్ని స్వీకరించారు.
తదుపరి గట్టుమీదపల్లి, చింతకాయపల్లి, నూకినేనిపల్లి, కుంపిణీపురం,కోనాపురం గ్రామాల్లో పర్యటించి అన్ని గ్రామంలో ఇంటింటి వద్ద ఆగి ప్రజల సమస్యలను తెలుసుకొని వారు చెప్పిన సమస్యలను పై సంబంధిత అధికారులకు తెలిపి వాటి పరిష్కారానికై కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి బారతాల శ్రీధర్ బాబు యాదవ్,మంచే చంద్రశేఖర్,తోట కృషయ్య,బంట్రోత్ నరసింహులు,,కొండా శ్రీనివాసులు,పసుపులేటి ప్రవీణ్, శివకుమార్, రాము,గండికోట శివకుమార్,మునగ హరి, యనాదయ్య,
తోట భాస్కర్,వెంకటసుబ్బయ్య, నాగేంద్ర,రవీంద్ర, పెద్దబండి అన్న,చుక్కా యనాది, బి.నరసయ్య, జి.యనాది, నాగార్జున, సి.కొండయ్య,లక్ష్మయ్య,శ్రీను,నరసింహ,యన్. రమణ తదితరులు పాల్గొన్నారు.