27.7 C
Hyderabad
April 18, 2024 10: 47 AM
Slider కృష్ణ

సర్దుమణిగిన విజయవాడ ‘దేశం’ అంతర్గత కుమ్ములాటలు

#KesineniSweta

విజయవాడ రాజకీయాల్లో తెలుగు తమ్ముళ్ల విభేదాలు సద్దుమణిగాయి. శనివారం ఉదయం నుంచి హాట్ హాట్‌గా సాగిన బెజవాడ రాజకీయాలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు కట్టడి చేశారు.

టెలికాన్ఫరెన్స్‌లో అందరితో మాట్లాడిన చంద్రబాబు… అసంతృప్త నేతలను సముదాయించినట్టు తెలుస్తోంది. అధినేత ఆదేశాలతో బెజవాడ నేతలతో అచ్చెన్నాయుడు, టి.డి. జనార్దన్‌, వర్ల రామయ్య చర్చించారు.

విభేదాలను పక్కనపెట్టి కలిసి పనిచేయాలని నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆదివారం చంద్రబాబు పర్యటనలో అందరూ పాల్గొని కేశినేని శ్వేతను మేయర్ గా గెలిపించేందుకు కృషిచేయాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

Related posts

10న బి‌ఆర్‌ఎస్ పార్టీ సమావేశం

Murali Krishna

జార్ఖండ్ బ్యాలెట్ వార్: ఉత్కంఠ భరితం

Satyam NEWS

గవర్నర్ పర్యటనకు సకల ఏర్పాట్లు చేయాలి

Satyam NEWS

Leave a Comment