40.2 C
Hyderabad
April 19, 2024 15: 20 PM
Slider ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ ను ప్రసన్నం చేసుకోవడానికి టిడిపి యత్నం

pavan kalyan

ఇసుక కొరతపై రేపు విజయవాడ ధర్నాచౌక్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 12 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తున్నారని దీనికి మద్దతు పలకాలని తెలుగుదేశం పార్టీ నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కోరారు. పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన టిడిపి నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య ఈ మేరకు పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలపాలని పవన్ ను కలిసి కోరాం, ఆయన కూడా సానుకూలంగా స్పందించి సంఘీభావం ప్రకటిస్తామని చెప్పారు అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని, సిఎం జగన్ తీరు వల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బ తిన్నదని అన్నారు. అందువల్లే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు. సమస్యను పరిష్కరించాలని అడిగితే ఎదురు దాడి చేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం ప్రతిపక్షాల విధి. అయితే నిన్న పవన్ ప్రెస్ మీట్ పెట్టగానే ఒక మంత్రి వచ్చి మళ్లీ వ్యక్తిగతంగా ఆయనను దూషించారు ఇది కరెక్టు కాదు అని అచ్చెన్నాయుడు అన్నారు.

Related posts

కోర్టు ధిక్కరణ కేసుపై సుప్రీంకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వం

Satyam NEWS

నిర్మల్ కోర్టు వర్తికల్ అధికారులకు ఒక రోజు శిక్షణ

Satyam NEWS

అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే శిక్షించాలి

Satyam NEWS

Leave a Comment