వినాయక చవితి పండగ ను బహిరంగంగా జరుపుకోవడం నిషేధమంటూ జగన్ ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై తెలుగు దేశం పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ విజయనగరం టీడీపీ నేతులు ఓ లేఖను సీఎం జగన్ ను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తున్నారు.
ఈ మేరకు అశోక్ బంగా లోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నేత ఐవీపీ రాజు ,విజ్జపు ప్రసాద్, ఇతర నేతలంతా మాట్లాడారు. వినాయక చవితి అందరి పండుగని ..అన్ని మతాల వారు స్వచ్చందంగా నిర్వహించుకుంటారని…అలాంటి పండుగకు సీఎం జగన్ ఆంక్షలు పెట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
దేవుడ్ని గౌరవంగా భక్తి శ్రద్దలతో పూజిస్తాని…ఈ నిర్షయం పై ప్రజలు తీవ్రంగా బాదడుతున్నారు. మతాలకు,కులాలుకు ఈ ప్రభుత్వం లింక్ లు పెడుతోందన్నారు. రాష్ట్రంలతో తెలుగు వారందరూ మీ చర్యలను తీవ్రంగా ఖండిస్తోందని.కరోనా నిబంధనలను పాటిస్తూ.. వినాయక చవితికి అడ్డంకి లేకుండా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిణీ చేస్తామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఐపీవీ రాజు తెలిపారు.