35.2 C
Hyderabad
April 20, 2024 18: 30 PM
Slider తూర్పుగోదావరి

నేటి నుండి తెలుగుదేశం పండుగ

గోదావరి జిల్లాలకు తెలుగుదేశం పండగ వచ్చింది.టిడిపి శ్రేణిలో ఎక్కలేని ఉత్తేజాన్ని నింపింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరి మహానాడుకకు వేదికైంది. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది ఈ మహానాడు పండుగలో పాల్గొనేందుకు తరలి వస్తున్నారు. రాజమహేంద్రవరం నగరంతో పాటు గోదావరి జిల్లాల్లు పసుపు తోరణాలతో ముస్తాబయ్యాయి.శనివారం టిడిపి ప్రతినిధులు సభ పదిహేను వేల మందితో జరుగుతుంది. ఆదివారం మహనాడు బహిరంగ సభ పదిహేను లక్షల మంది హాజరవుతారని అంచనా.

వచ్చిన వారందరికీ గోదావరి జిల్లాల ఆతిథ్యం, విందు అందించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం చేరుకున్నారు. అలాగే ప్రముఖ టిడిపి నేతలంతా కార్యకర్తలుగా మహనాడు ఏర్పాట్లు చేపట్టారు. ప్రతినిధులు సభలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ (కృష్ణుడు) కటౌంట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అలాగే బహిరంగ సభలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహం అద్భుతంగా ఉంది. నాలుగు లైన్ల జాతీయ రహదారి పొడవునా టిడిపి ఫ్లెక్సీలు,కటౌట్లు పోటాపోటీగా ఏర్పాటు చేసారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు.

Related posts

నటుడిగా రాణించాలనుకుంటున్న మరో ఎన్నారై వెంకట్ దుగ్గిరెడ్డి

Satyam NEWS

ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

Bhavani

పేద బ్రాహ్మాణ కుటుంబాలకు బియ్యం పంపిణీ

Satyam NEWS

Leave a Comment