35.2 C
Hyderabad
April 24, 2024 11: 51 AM
Slider ప్రత్యేకం

ఎన్ని కేసులు పెట్టినా ఏమీ పీకలేరు

#naralokesh

తెలుగుదేశం పార్టీకి బలం కార్యకర్తలే. దేశంలో, ప్రపంచంలోఏ మూలన ఉన్నా కార్యకర్తలంతా ఎత్తిన పసుపు జెండాలు దించకుండా పోరాడుతున్నారు అని పార్టీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నేడు ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ మనకు రాముడు… చంద్రబాబు మనకు దేవుడు అని ఆయన అన్నారు. కార్యకర్తలను అన్నిరకాలుగా ఆదుకోవడానికే సభ్యత్వ నమోదుకి శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. వరల్డ్ బ్యాంక్ లో పని చేసినా, హెరిటేజ్ లో పని చేసినా, మంత్రిగా పనిచేసినా కలగని సంతృప్తి.. సంతోషం, టీడీపీ కార్యకర్తల విభాగం సమన్వయకర్తగా  పనిచేసినప్పుడు కలిగాయని లోకేశ్ తెలిపారు.

2004లో పార్టీ ఓడిపోయాక, అప్పుడున్న ప్రభుత్వం పెద్దఎత్తున రాష్ట్రంలో ఫ్యాక్షనిజం దాడులకు పాల్పడిందని,  దాదాపు 167 మంది పార్టీ కార్యకర్తల్ని అతికిరాతకంగా హతమార్చారని ఆయన గుర్తు చేశారు. అప్పుడే  పార్టీ కోసం ప్రాణాలర్పించిన వారి పిల్లల భవిష్యత్ కోసం ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ని చంద్రబాబు ప్రారంభించారని తెలిపారు.

ప్రమాద బీమా కింద 2 లక్షల పరిహారం

1250 మంది విద్యార్థులు ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో ఇప్పటి వరకు విద్యనభ్యసించారని, 1500 మంది  ఇప్పటికీ విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారని లోకేశ్ తెలిపారు. కార్యకర్తలు ప్రమాదవశాత్తూ చనిపోతే ప్రమాద బీమా కింద వారి కుటుంబాలకు రూ.2లక్షలు అందిస్తున్నామని ఆయన ప్రకటించారు.

గత 8 ఏళ్లలో 4,844 మంది కార్యకర్తలు ప్రమాదాల్లో చనిపోతే, రూ.96 కోట్ల 88 లక్షల ప్రమాద బీమా అందించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీనే అని ఆయన తెలిపారు. కార్యకర్తలకు స్వయం ఉపాధి, వారి పిల్లల చదువుల నిమిత్తం రూ.20కోట్లను పార్టీ సంక్షేమ విభాగం ద్వారా ఆదుకున్నామని లోకేశ్ తెలిపారు.

1982 నుంచి పార్టీలో ఉన్న సీనియర్లకు ప్రతినెలా పింఛన్ల ద్వారా 35 లక్షల వరకు చెల్లించామని ఆయన అన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలపై పెట్టిన దొంగకే సుల నుంచి వారిని బయటపడేయడానికి న్యాయ సహాయంకోసం రూ.7కోట్లు ఖర్చుపెట్టామని లోకేశ్ తెలిపారు.

కార్యకర్తలు, వారి కుటుంబసభ్యుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేలా కొత్తగా తీసుకునే సభ్యత్వ నమోదు కార్డుల్ని తీర్చిదిద్దామని ఆయన తెలిపారు. తొలుత సభ్యత్వాన్ని పుస్తకాల్లో, తరువాత కంప్యూటర్లలో చేశాము. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలోని వాట్సాప్, టెలిగ్రామ్  ఫీచర్ల తో  చేయబోతున్నామని ఆయన తెలిపారు.

కార్యకర్తలకు అండగా ఉండేలా టెక్నాలజీని వాడుకుంటుంటే ఈ వేస్ట్ ప్రభుత్వం అడ్డుకుంటోందని లోకేశ్ అన్నారు. జగన్మోహన్ రెడ్డికి సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలియనప్పుడు నన్ను అడిగితే చెప్తాను కదా అని ఆయన అన్నారు. ఈ ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఏం చేసినా…ఎన్ని కేసులు పెట్టినా ఏమీ పీకలేరని లోకేశ్ అన్నారు.

సభ్యత్వ నమోదుకి సంబంధించిన వాట్సాప్ నెంబర్ : 9858175175.

ఆ నంబర్ కి హాయ్.. హలో అని మెసేజ్ పెడితే ఆటోమేటిగ్గా బాట్ వస్తుంది. దాన్నిక్లిక్ చేస్తే సభ్యత్వనమోదు ప్రక్రియ వివరాలు అడుగుతుంది.

టెలిగ్రామ్ లో JAI TDP   అనే బాట్ వస్తుంది. మూడో మార్గంలో గూగుల్ ప్లే స్టోర్ లో ఉండే టీడీపీ  యాప్ ద్వారా సభ్యత్వాన్ని తీసుకోవచ్చు.

Related posts

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు నమోదు చేసుకోండి

Satyam NEWS

పవర్ ప్లాంట్ కార్మికులను స్వస్థలాలకు పంపిస్తాం

Satyam NEWS

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కెసిఆర్ జైలుకే

Satyam NEWS

Leave a Comment