38.2 C
Hyderabad
April 25, 2024 11: 13 AM
Slider విజయనగరం

టీడీపీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ప్ర‌చార జోరు షురూ

#AditiGajapatiRaju

విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ రోడ్ల‌పై కేంద్ర మాజీ  మంత్రి ,టీడీపీ సీనియ‌ర్ నేత పోలిట్ బ్యూరో స‌భ్యుని కుమార్తె ఆదితీ గ‌జ‌ప‌తిరాజు పార్టీ కార్యక‌ర్త‌ల‌తో సందడి చేసారు.

వ‌చ్చే నెల 10న జ‌ర‌గ‌నున్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల సంద‌ర్బంగా విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ కు జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారంలో వాళ్లంతా పాల్గొన్నారు.

ఈ మేర‌కు నగ‌రంలోని 1 వ‌,13 వ డివిజ‌న్  ప‌రిధిల‌లో ఉద‌యం నుంచీ విజ‌య‌న‌గ‌రం నియోజ‌క వ‌ర్గ ఇంచార్జి ఆదితీ గ‌జ‌ప‌తి రాజు  ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఆమెతో పాటు మాజీ చైర్మ‌న్ ప్ర‌సాదుల క‌న‌క‌మ‌హ‌లక్ష్మీ,అలాగే పార్టీకి కార్పొరేష‌న్ మేయ‌ర్ అభ్య‌ర్ధిని శ‌మంత‌క‌మ‌ణి ,రెండు డివిజ‌న్ల అభ్య‌ర్ధినిలు ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు.

తొలిసారిగా విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కు ఎన్నికలు జ‌ర‌గ‌బోతున్నాయ‌ని…ఈ ఎన్నిక‌ల‌లో గ‌తంలో మాదిరిగానే టీడీపీ  ఓట‌ర్లు ప‌ట్టంక‌ట్టాల‌ని టీడీపీ నేత‌లు కోరారు.

తొలుత నియోజ‌క ఇంచార్జి ఆదితీ  గ‌జ‌ప‌తి రాజు మాట్లాడుతూ… న‌గ‌రంలో మున‌ప‌టి మాదిరిగానే ప్ర‌జ‌లు టీడీపీనే ఆద‌రిస్తున్నార‌న్నారు.

మేయ‌ర్ స్థానానికి బీసీ మ‌హిళ‌కు చెందిన శ‌మంత‌కమ‌ణిని దించామ‌న్నారు.

ప్ర‌స్తుత వైఎస్ఆర్సీపీ ప్ర‌భుత్వం అవ‌లంబిస్తున్న వైఖ‌రి ఎలా ఉందో..న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు తెలుసున‌ని త‌మ పార్టీకే ప‌ట్టం క‌డ‌తార‌నే న‌మ్మ‌కం ఉంద‌న్నారు.

అనంత‌రం మాజీ వైఎస్ చైర్మ‌న్ ప్ర‌సాదుల క‌న‌క‌మ‌హ‌ల‌క్షి మాట్లాడుతూ…టీడీపీ కి ప్ర‌జ‌లు ప్ర‌చారంలో బ్ర‌హ్మ‌రథం ప‌డుతున్నార‌న్నారు.

మేయ‌ర్ అభ్య‌ర్ధిని శ‌మంత‌క‌మ‌ణి మాట్లాడుతూ…ఇన్నాళ్లు  న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు టీడీపీ ఏం చేసిందో…వైఎస్ఆర్సీపీ ఏం చేసిందో తెలుసునున్నారు.

ప్ర‌జ‌ల‌కు త‌మ పార్టీకే ప‌ట్టం క‌డ‌తార‌ని మేయ‌ర్ అభ్య‌ర్దిని పేర్కొన్నారు. ఈ సంద‌ర్బంగా కొత్త‌పేట డివిజ‌న్ లో ముఖ్య‌మైన కూడ‌ళ్ల‌లో టీడీపీ నేత‌లు ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు.

Related posts

ఆశ్రమ పాఠశాలల మౌలిక వసతుల పనులు పూర్తి చేయండి

Satyam NEWS

రేషన్ డీలర్ల సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి గంగుల

Satyam NEWS

డిసెంబరు నాటికి తిరుమలలో ఆటోమేటిక్ లడ్డూ యంత్రాల ఏర్పాటు

Bhavani

Leave a Comment