ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ తన ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకే తెలుగుదేశం పార్టీని బలపరచాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీ దేవి అన్నారు.
సర్పంచ్ ఎన్నికలలో మత్స్యకార గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం చాలా సంతోషకరమని ఆమె అన్నారు.
శ్రీకాకుళం జిల్లా రూరల్ మండలం, గార మండలంలో తెలుగుదేశం పార్టీ మంచి ఫలితాలు సాధించిందని ఆమె తెలిపారు.
మత్స్యకారులను తెలుగుదేశం పార్టీకి దూరం చేసే ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చారని ఆమె తెలిపారు. అయినా వారు తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారని ఆమె అన్నారు.