ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష ప్రారంభించారు. విజయవాడ ధర్నాచౌక్లో ఉదయం చంద్రబాబు దీక్ష ప్రారంభం అయింది. రాత్రి 8గంటల వరకు దీక్ష కొనసాగనుంది. చంద్రబాబునాయుడు 12 గంటల పాటు దీక్షలో కూర్చోనున్నారు. భవన నిర్మాణ కార్మికుల్లో భరోసా పెంచడమే లక్ష్యంగా చంద్రబాబు దీక్ష నిర్వహిస్తున్నారు. చంద్రబాబు దీక్షకు జనసేన, లెఫ్ట్, ఆప్ సంఘీభావం తెలిపాయి. చంద్రబాబుకు దీక్షా ప్రాంగణం వద్ద వేద పండితులు స్వాగతం పలికారు. ముందుగా ఆయన బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మహాత్మాగాంధీ, ఎన్టీఆర్ చిత్రపటాలతో పాటు ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు చంద్రబాబు నివాళులర్పించారు.
previous post