సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు చావా కిరణ్మయి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఎల్. రమణ 60వ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కిరణ్మయి పార్టీ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రమణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాబోయే రోజులలో మరింత బలోపేతమౌతుందని, పార్టీ కార్యకర్తలు,అభిమానులు ఎవరూ అధైర్య పడవద్దని, పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని అన్నారు.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతున్న అధర్మ, అరాచక పాలన త్వరలోనే అంతమౌవుతుందని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఉభయ రాష్ట్రాలలో తన సత్తా చాటుకుంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వాణిజ్య రాష్ట్ర కార్యదర్శి చావా సహదేవ రావు, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గార్లపాటి శ్రీనివాస నాయుడు, నలమాద శ్రీనివాస యాదవ్ పాల్గొన్నారు.
ఇంకా, తిరుమలగిరి గోవిందు, చింతలపాలెం మండలం పార్టీ అధ్యక్షుడు టి.తిర్మలి, గొట్టే రాము యాదవ్, నాగు నాయక్, బెల్లంకొండ రామజోగి, ఆవులపాటి శ్రీనివాస్, షేక్ చిన్న సైదా, వేముల సీతారాములు, భూక్యా భరత్, ఓర్సు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.