అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో ని మద్యం దుకాణం వద్ద బుధవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మద్యం దుకాణం వద్ద మద్యం కొనుగోలు చేసి బిల్లులు అడగగా మద్యం దుకాణాదారులు బిల్లు ఇవ్వలేదు.ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు మద్యం దుకాణం వద్ద రాష్ట్ర ప్రభుత్వం కు వ్యతిరేకంగా నినాదాలు చేసి,మద్యం అమ్మకాలు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.బిల్లులు ఇవ్వకుండా అక్రమాలకు పాల్పడు తున్నారని ఆరోపణలు చేశారు.దీన్ని అసరా గా చేసుకొని తెలుగు దేశం పార్టీ నేతల పై తప్పుడు కేసులు బనాయిస్తూన్నారని భత్యాల ఆరోపించారు. బిల్లులు ఇస్తే ఇటువంటి పరిస్థితి ఉత్పన్నం కాదని అన్నారు.దీనిపై న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.
previous post