పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులతో కలసి టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు.
ఈ నిరసనలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు నియోజకవర్గం ఇంచార్జ్ రాధాకృష్ణ (చంటి) తెలుగుదేశం కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.
నిమ్మల మాట్లాడుతూ రైతులు ధాన్యం బకాయిలు 3,600 కోట్లు వెంటనే చెల్లించాలని, రైతు లు, కౌలు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.