జగన్ ప్రభుత్వం… టీడీపీ పై కక్ష కట్టిందా…లేక ఎన్టీఆర్ పై పగబట్టిందా..? విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు పై సర్వత్రా నిరసనలు జరుగుతున్నాయి…టీడీపీ శ్రేణులు… ఆందోళన లకు సిధ్ధమవుతున్నాయి.గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ బేగంపేట ఎర్ పోర్ట్ కు దివంగత ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఎన్నో ఆందోళనలు చేసింది.. టీడీపీ.
తాజాగా జగన్ ప్రభుత్వం ఏకంగా ఉన్న పేరు నే తొలగించి.. దివంగత సీఎం వైఎస్సార్ పేరు పెట్టడంపై టీడీపీ తీవ్రంగా ధ్వజమెత్తుతోంది.ఈ క్రమంలో విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత… నిరసన స్వరం వినిపించారు. ఈ మేరకు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలని విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత డిమాండ్ చేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దశ దిశలా చాటిచెప్పిన మహనీయుడు, తెలుగు ప్రజల ఆరాధ్యుడు నందమూరి తారక రామారావు అవమానపరిచే చర్యలకు జగన్ ప్రభుత్వం తెగబడుతోందని అన్నారు.
డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చుతూ నిర్ణయం తీసుకోవడాన్ని ఖండించారు. ప్రభుత్వం మారినప్పుడల్లా పేర్లు మార్చడం మంచి సంస్కృతి కాదని హితవు పలికారు. కొత్తగా పెట్టిన సంస్థలకు పెట్టుకోవచ్చని, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలని డిమాండ్ చేశారు.