కడప పట్టణంలో గురువారం నగరంలోని హరి టవర్స్ లో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరి ప్రసాదు ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు. నిరసన దీక్షలో టీడీపీ నేతలు మాట్లాడుతూ కరోనా విపత్తులో పేద,మధ్య తరగతి ప్రజలు పనులు లేక జీతాలు,ఆదాయం లేక అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు 3 రెట్లు పెంచి సామాన్య ప్రజలు కోలుకోలేని విధంగా పాలన సాగించడం దారుణమన్నారు.
ప్రభుత్వం సామాన్యుడి ఆర్థిక స్వావలంబన పెంపొందించాల్సింది పోయి, పన్నుల భారం మోపి ప్రభుత్వ బొక్కసం నింపుకుంటున్నారన్నారు. నిరసన దీక్ష కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి,రాష్ట్ర మత్స్య శాఖ మాజీ డైరెక్టర్ యాటగిరి రాంప్రసాఫ్, బీసీ సెల్ కార్యదర్శి మాసా కోదండ,మైనార్టీ నాయకుడు అమీర్ బాషా తదితరులు పాల్గొన్నారు.