పెరిగిన నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను నిరసిస్తూ చంద్రగిరి క్లాక్ టవర్ దగ్గర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గం ఇంచార్జి పులివర్తి నాని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర గా వెళ్ళి మండల అధికారులకు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్బంగా పులివర్తి నాని మాట్లాడుతూ ధరలు నియంత్రణ చేయలేని సీఎం వెంటనే గద్దె దిగిపోవాలని, ధరల స్థిరీకరణ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
previous post
next post