కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధి లోని కుమ్మరపల్లి గ్రామంలో ఇళ్లు లేని నిరుపేదలకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంజూరు చేయటం వాటికి తెలుగుదేశం ప్రభుత్వంలో చెల్లించిన బిల్లులు తప్ప ప్రస్తుత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెడుతున్నారు.
అందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ మండలం అధ్యక్షులు సమ్మెట శివప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ పేదలు పూర్తి స్థాయి లో గృహాలు నిర్మాణం కాక చాలా ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సమ్మెట ఉమామహేష్, సుబ్బారాయుడు, చిన్న, లబ్ధిదారులు పాల్గొన్నారు.