36.2 C
Hyderabad
April 25, 2024 21: 27 PM
Slider తూర్పుగోదావరి

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై అమలాపురంలో నిరసన

#TDP Amalapuram

నిత్యావసర వస్తువుల ధరలు ఇష్టానుసారం పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదంటూ అమలాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి అయితా బత్తుల ఆనంద రావు ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు.

అమలాపురం గడియార స్తంభం సెంటర్లో నిర్వహించిన ఈ ధర్నా కార్యక్రమంలో ఆనందరావు  మాట్లాడుతూ పెట్రోల్ మరియు డీజిల్.. గ్యాస్. పప్పు దినుసులు వంటి ధరలు ఆకాశాన్నంటుతున్నా జగన్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు.

మెట్ల రమణబాబు మాట్లాడుతూ నేటి జగన్ తీరు దోచుకోవడం. దాచుకోవడం అన్న చందంగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరి, టిడిపి నాయకులు పెచ్చిట్టి విజయలక్ష్మి, చిల్లా పురుషోత్తం, బోర్ర వెంకటేశ్వరరావు, ఆశెట్టి ఆది బాబు, వలవల శివ రావు, గిడ్ల వెంకటేష్, ఈతకోట నగేష్, కుంచె వెంకన్నబాబు, కుడుపూడి గంగాధర్, దాసరి వీర వెంకట సత్యనారాయణ, పబ్బిని డి రాంబాబు, యాళ్ళ సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related posts

క్రష్ డ్ టు డెత్: కారు చక్రాల కింద దారుణం

Satyam NEWS

పయ్యావుల కేశవ్ భద్రత పూర్తిగా తొలగింపు: ఖండించిన పోలీసులు

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీ ద్వారానే నిరుద్యోలకు న్యాయం జరుగుతుంది

Satyam NEWS

Leave a Comment