ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన జగనన్న వసతి దీవెన కొత్త స్కీమ్ కాదని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. గతంలో తాము డైట్ ఛార్జీల కింద నెలకు 1400 రూపాయలు చొప్పున 10 నెలలకు కలిపి 14 వేల రూపాయలు ఇచ్చామని ఆయన అన్నారు.
టీడీపీ అమలు చేసిన పథకాలకు పేర్లు మార్చి జగన్ కొత్త పథకాలుగా ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కొత్త స్కీముల పేరుతో ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేస్తున్నారని యనమల ఆరోపించారు. రాష్ట్రానికి 9 నెలల్లో 22 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయనడం పచ్చి అబద్ధమని యనమల పేర్కొన్నారు . అదే నిజమైతే ఈ 9 నెలల్లో రాష్ట్రానికి వచ్చిన కంపెనీల పేర్లు బయట పెట్టాలని సవాల్ చేశారు.
టీడీపీ సర్కార్ 19000 రూపాయలు ఇస్తే జగన్ సర్కార్ వేయి రూపాయలు కలిసి ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో లాగేసుకుంటోందని యనమల విమర్శించారు. 75 శాతం హాజరు ఉండాలని కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని అభ్యంతరాలు పెడుతున్నారని ఆయన అన్నారు.