తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అత్తిలి అప్పారావు ఆదివారం పరమపదించారు. ఆయనకు భార్య ,ఇద్దరు కుమార్తెలు , ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన నందమూరి తారకరామారావు పై అభిమానంతో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు పట్ల ఆకర్షితులై 1983లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అయన చివరికి వరకు టిడిపిలోనే కొనసాగారు.
పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ తో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తో కల్సి పని చేసిన నేతల్లో అప్పారావు ఒకరు. క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేవారు పార్టీ కి తొలి నుంచి సేవలు అందిస్తున్న బీసీ నేతల్లో అత్తిలి అప్పారావు ఒకరు. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు.
గంగవరం గ్రామం తరలింపు సమయంలో మత్స్యకారులు తరుపున నిలబడి వారికి న్యాయం చేయడంలో చిత్తశుద్ధితో పోరాటం చేశారు. బీసీల ఉద్యమం లో కీలక పాత్ర పోషించారు. బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారు.