28.2 C
Hyderabad
April 20, 2024 13: 14 PM
Slider నల్గొండ

ప్రొఫెసర్ కోదండరామ్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి

#TDPHujurnagar

నల్లగొండ, ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన తెలంగాణ జన సమితి అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరామ్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఉన్నత విద్యావంతులను ఓట్లు అభ్యర్థించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొఫెసర్ కోదండరామ్ కి ఓటు వేయడం ద్వారా రాష్ట్ర నిరుద్యోగుల  సమస్యలపై శాసనమండలిలో కోదండరామ్ పోరాడుతారని అన్నారు.టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చి విఫలమైన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర నాయకులు మండవ వెంకటేశ్వర్లు, తెలంగాణ జన సమితి నియోజకవర్గ ఇన్చార్జి దొంతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్ కె అలీ,ఎస్టి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోత్ వెంకట్ రామ్ నాయక్,మఠంపల్లి మండల పార్టీ అధ్యక్షుడు మాలోత్ నాగు నాయక్,గరిడేపల్లి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పోలగాని సురేష్ గౌడ్,ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మీసాల సైదులు, టి ఎన్ టి యు సి పార్లమెంట్ కార్యదర్శి కొమ్ము మధు,రాంబాబు   తదితరులు పాల్గొన్నారు.

Related posts

హుజూర్ నగర్ ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ప్రసూతి సౌకర్యం పెంచండి

Satyam NEWS

జనసేవతోనే జనసేన విజయం సాధించడం ఖాయం

Satyam NEWS

శ్రీశైలం జల విద్యుత్ కేంద్ర ప్రమాదంపై విచారణ షురూ

Satyam NEWS

Leave a Comment