మునిసిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే తీర్చాలని గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. నరసరావుపేట మున్సిపల్ ఆఫీసులో కాంట్రాక్ట్ బేసిక్ కార్మికుల సమస్యలపై జరుగుతున్న దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు.
మున్సిపల్ కమిషనర్ ఈ సమస్యలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి తెలియచేయాలని ఆయన కోరారు. ఈ సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలని లేకపోతే ఏ పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు.
ఏ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి కాస రాంబాబు, సి ఐ టి యు జిల్లా కార్యదర్శి సిలార్ కార్మిక సంఘాల నాయకులు మున్సిపల్ కార్మికుల కు సంఘీభావం తెలిపారు.