39.2 C
Hyderabad
April 25, 2024 17: 04 PM
Slider కృష్ణ

డప్పు కళాకారుల సంఘం నేతకు టీడీపీ నివాళి

#baburajendraprasad

పశ్చిమగోదావరి జిల్లా డప్పు కళాకారుల సంఘం కార్యదర్శి, సిపిఎం పార్టీ రూరల్ కార్యదర్శి నిమ్మది ఏడుకొండలు కు తెలుగుదేశం పార్టీ నాయకుడు బాబు రాజేంద్ర ప్రసాద్ నివాళి అర్పించారు. ఉయ్యూరు దళితవాడలో ఇటీవల అనారోగ్యంతో నిమ్మది ఏడుకొండలు మృతి చెందారు. ఏడుకొండలు చిత్రపటానికి బాబు రాజేంద్ర ప్రసాద్  నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఏడుకొండలు మంచి సేవా గుణం కలవారిని, సిపిఎం పార్టీ లో రూరల్ కార్యదర్శిగా, డప్పు కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శిగా ఉంటూ ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు, ఉద్యమాలు చేశారని తెలిపారు. అలాంటి వ్యక్తి అందర్నీవదిలి వెళ్లిపోవడం చాలా బాధాకరమని, వారి కుటుంబానికి ఏ సహాయం కావాలన్నా తాను అండగా ఉంటానని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మహిళా సంఘం జిల్లా కార్యదర్శి జ్యోతి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పవన్. సిపిఎం జిల్లా నాయకులు కె. శివ నాగేంద్ర, సిపిఎం ఎన్టీఆర్ జిల్లా నాయకులు కళ్యాణ్, ప్రజా నాట్య మండలి కార్యదర్శిఖాసీం, బి.రాజేష్, రత్నం భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అప్పుడు బాగా ఖర్చు చేశా ఇప్పుడు ఆదా చేయాలి

Satyam NEWS

పఠనాసక్తిని పెంపొందించేందుకు విద్యాశాఖ దృష్టి

Satyam NEWS

చెరువు పండగ లో అపశృతి

Bhavani

Leave a Comment