సంగీత ప్రపంచంలో గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కీర్తి అజరామరమని, ఆయన మరణించినా ఆయన సంగీత పాటల్లో చిరంజీవిగానే ప్రజల మనసులో గుర్తుండి పోతారని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ భవన్లో ఎస్పీ బాలసుబ్రమణ్యం 11వ రోజు ఈ కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూజలు నిర్వహించి, జ్యోతి వెలిగించి,మౌనం పాటించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రామలక్ష్మి గోవిందప్ప పట్టణ కన్వీనర్ మురళి తలారి సత్యప్ప కర్తనపర్తి మాజీ సర్పంచ్ శివన్న తదితరులు పాల్గొన్నారు.