39.2 C
Hyderabad
April 25, 2024 15: 13 PM
Slider గుంటూరు

తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెస్తాం

#Chadalawada 1

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు. ఈరోజు నరసరావుపేటలోని 20 వ వార్డు వాలంటీర్లు, కార్యకర్తలు వైస్సార్ సీపీ కి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అరవింద బాబు మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలను వాలంటీర్ల పై ఉసిగొల్పి మహిళలని కూడా చూడకుండా దాడులకు పాల్పడటం సిగ్గుచేటని అన్నారు. తెలుగుదేశం పార్టీ మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ది పరచిందని డ్వాక్రా గ్రూపుల స్థాపన నుండి ప్రతి రంగంలో మహిళలను అభివృద్ది పరచిన ఘనత టీడీపీ దేనని ఆయన అన్నారు.

పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని పార్టీకి పూర్వవైభవం తెచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసి తీరుతామని ఆయన అన్నారు. జగన్ పాలన రాక్షస పాలన మాదిరిగా ఉందని అరవింద బాబు అన్నారు. రాజీనామా చేసిన వాలంటీర్ మాట్లాడుతూ వార్డు నాయకులు ఆధిపత్యపోరు వేధింపులు తట్టుకోలేక రాజీనామా చేశానని తెలిపారు.

 ప్రభుత్వ పనికి నాయకులకు ముడుపులు అప్పజెప్పాలని వార్డు నాయకులు ఒత్తిడి తేవడంతో స్వచ్ఛందంగా రాజీనామా చేసి టిడిపిలో చేరానని అన్నారు. ఈ కార్యక్రమంలో కడియాల రమేష్,శేఖర్, వల్లెపు నాగేశ్వరరావు, పులిమి రామిరెడ్డి, బొప్పూడి వెంకాయమ్మ వార్డ్ నాయకులు పాల్గొన్నారు.

Related posts

ప్యూన్‌ ఉద్యోగానికి 15 లక్షల మంది పోటీ.. ఎంఫిల్‌, డిగ్రీ హోల్డర్లు..

Sub Editor

ఆ వెలుగులకే నా ప్రస్థానం

Satyam NEWS

జగిత్యాల డిఎస్పి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రాం

Satyam NEWS

Leave a Comment