35.2 C
Hyderabad
April 24, 2024 11: 02 AM
Slider ముఖ్యంశాలు

ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ విజయం

#tdp

ఆంధ్రప్రదేశ్‌లో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండింటిని టీడీపీ కైవసం చేసుకుంది. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు కైవసం చేసుకోగా, తూర్పు రాయలసీమ శాసనమండలి గ్రాడ్యుయేట్ స్థానంలో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. పశ్చిమ రాయలసీమ స్థానంలో మాత్రం హోరాహోరీ కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర స్థానంలో విజయం సాధించిన చిరంజీవిరావు విజయానికి అవసరమైన ఓట్లలో 90 శాతం తొలి ప్రాధాన్యత ఓట్లలో సాధించగా మిగిలినవి రెండో ప్రాధాన్యత ఓట్లు రావడంతో ఆయన విజయం సాధించారు. విజయానికి 94,509 ఓట్లు అవసరం కాగా, తొలి ప్రాధాన్యంలో 82,958, రెండో ప్రాధాన్యంలో 11,551 ఓట్లు సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో కలిపి చిరంజీవిరావుకు మొత్తం 1,12,686 వచ్చాయి. వైసీపీ అభ్యర్థి సుధాకర్ టీడీపీ అభ్యర్థికి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. ఇద్దరి మధ్య భారీ తేడా కనిపించింది.  సిటింగ్‌ ఎమ్మెల్సీ, భాజపా అభ్యర్థి మాధవ్‌ సహా 34 మందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. 

Related posts

అన్న‌దాత‌ సుభిక్షంగా ఉండాలి

Satyam NEWS

ఫేక్ చాట్ లతో నా మీద దుష్ప్రచారం: కల్వకుంట్ల కవిత

Satyam NEWS

ఆరంజ్ ట్రావెల్స్ కు తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

Satyam NEWS

Leave a Comment