అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం, రాచపల్లి గ్రామానికి చెందిన జి. మల్లికార్జున నాయుడు ను అదే గ్రామానికి చెందిన వైసీపీ రౌడీ మూకలు దాడిచేసి విచక్షణ రహితం గాయపరిచారు. దారిద్ర్యరేఖకు దిగువున వున్న పేద ప్రజల ఉపాధి కొరకు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉపాధి హామీ పనులలో, మొక్కలు నాటకుండా, కాలువలు తీయకుండా రికార్డుల్లో మాత్రమే చూపడం, మస్తరు వేయకుండా నగదు ఖాతాల్లో జమచేయడం వంటి అవకతవకలు గ్రామంలో వైసీపీ వాళ్ళు పాల్పడటంతో మల్లికార్జున నాయుడు జిల్లా కలెక్టర్ కి పిర్యాదు చేయడంతో, వైసీపీ రౌడీ మూకలు దాడి చేసి గాయపరిచారు.
కడపలోని రిమ్స్ లో చికిత్స పొందుతున్న మల్లికార్జున నాయుడిని పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాస రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు అరాచకాలు, చేయడం తో పాటు, టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయడంలో వైసీపీ వాళ్ళు రోజు రోజుకు మితిమీరిపోతున్నారు అని విమర్శించారు.
నింధితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. బాధితునికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.