గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం కంభంపాడు లో ముఠా తగాదాలు గుప్పుమన్నాయి. వైసీపీ,తేదేపా వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది.
ఈ ఘర్షణకు సంబంధించి కేసు నమోదు చేయడంలో పోలీసులు తీవ్రమైన పక్షపాతాన్ని ప్రదర్శించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
తేదేపా వర్గీయులపై కేసు నమోదు చేసి ఆరుగురిని పెదకూరపాడు పోలీసు స్టేషన్ లో నిర్భంధించిన పోలీసులు వైసీపీ వర్గీయులపై ఇచ్చే ఫిర్యాదును కూడా తీసుకోవటానికి నిరాకరించారు.
దాంతో యాభైమంది కంభంపాడు మహిళలు పోలీసు స్టేషను ముందు ఆందోళనకు దిగారు.
జగనన్న కాలనీకి విద్యుత్ లైనులు తేదేపా వారి పొలాల మీదుగా లాగుతున్న సందర్భంలో గొడవ జరిగినట్లు ప్రాధమిక సమాచారం.