టీడీపీ ఏకైక ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ ఎస్లో చేరారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆయన భేటి అయ్యారు.
టీడీపీ శాసనసభాపక్షాన్ని టీఆర్ ఎస్లో విలీనం చేస్తున్నట్టు ఆయన ప్రకటన చేయబోతున్నారు. ఈ మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేఖ సమర్పించారు.
లేఖను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కల్సి స్పీకర్కు మెచ్చ నాగేశ్వరరావు అందించారు.
శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కూడా భేటీ అయిన టీడీపీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు తన నిర్ణయాన్ని తెలిపారు.
టీడీఎల్పీ విలీనంపై అధికారిక బులిటెన్ ను శాసనసభ కార్యదర్శి నర్సింహాచారి జారీ చేయనున్నారు.