39.2 C
Hyderabad
March 28, 2024 13: 52 PM
Slider హైదరాబాద్

హేట్సాఫ్: పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు చాయ్ బిస్కెట్లు

baling school

కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు రాత్రనకా పగలనక ఎంతగానో శ్రమిస్తున్న మియపూర్ పోలీసులకు, ట్రాఫిక్ పోలీసులకు, ఎన్ఫోర్స్మెంట్, డిసాస్టర్ మనేజ్మెంట్ జి హెచ్ యం సి అధికారులకు తన వంతు సహాయంగా బాలింగ్ సత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షుడు, తెరాస హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ చాయ్ బిస్కెట్లు, స్నాక్స్ అందించారు. 

బాలింగ్ గౌతమ్ గౌడ్ మాట్లాడుతూ కరోనా మహమారిని నిర్ములించేందుకు ఎంతగానో శ్రమిస్తున్న మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రాత్రనకా పగలనక ఎర్రటి ఎండలో కుటుంబాలని విడిచిపెట్టి మన కోసం నిద్రాహారాలు, తాగడానికి మంచినీరు కూడా లేకుండా శ్రమిస్తున్న వారికి ఆయన  కృతజ్ఞతలు తెలిపారు.

మనం కూడా మన వంతు కృషి చేయాలని ఇళ్లలో నుండి బయటకి రాకుండా కరోనా మహమ్మారి నుండి మనల్ని మన కుటుంబాలని కాపాడుకోవాలని, అధికారులకు అందరికి సహకరించాలని కోరారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర శేరిలింగంపల్లి ప్రజలు అందరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

సంక్రాంతి సంబరాలు లో పాల్గొన్న ఎం.జి.ఆర్

Satyam NEWS

రూ.4 కోట్లతో అంబర్ పేట్ లో అభివృద్ధి పనులు

Satyam NEWS

అమర వీరుల దినోత్సవం సందర్భంగా విజయనగరం లో కొవ్వొత్తుల ర్యాలీ

Satyam NEWS

Leave a Comment