ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి మండలం ఘోట్కూరి జడ్పీఎస్ఎస్ హైస్కూల్లో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఖదీర్ అనే టీచర్ను గ్రామస్థులు స్కూల్లోనే నిర్బంధించడం తీవ్ర కలకలం రేపింది.
సదరు టీచర్ గత కొంత కాలంగా గర్ల్స్ స్టూడెంట్స్కు సెల్ ఫోన్లో బ్లూ ఫిల్మ్ చూపిస్తp వేధిస్తున్నట్లుగా బాధిత స్టూడెంట్స్ తమ తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో ఆగ్రహించిన పేరేంట్స్, గ్రామస్థులు స్కూల్కు చేరుకుని సదరు టీచర్ను ఓ గదిలో బంధించి ఆందోళనకు దిగారు.
విద్యాబుద్దులు నేర్పిస్తు స్టూడెంట్స్ను సత్ప్రవర్తనతో మెలిగిలా తీర్చిదిద్దాల్సిన టీచర్ వారిని పెడతోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలాంటి టీచర్ ఉంటే తమ పిల్లలను స్కూల్కు ఎలా పంపించాలని హెచ్ఎంతో వాదనకు దిగారు.
దీనిపై సమాచారమందుకున్న ఆదిలాబాద్ రూరల్ సీఐ పురుషోత్తం చారీ, ఎస్సై శిరీష, విద్యాశాఖ సెక్టోరియల్ ఆఫీసర్లు కంటె నర్సయ్య, ఉదయశ్రీ, కంది శ్రీనివాస్ రెడ్డిలు స్కూల్కు చేరుకుని విచారించారు. స్టూడెంట్స్, పేరేంట్స్, సదరు టీచర్తో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
స్థానిక హెచ్ఎం రిపోర్టు ఆధారంగా టీచర్ ఖదీర్ ను డ్యూటీ నుంచి సస్సెండ్ చేస్తు డీఈఓ ఎ.రవీందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు.
ఇదే మండల ఎంఈఓ ఇటీవల మందు తాగుతూ, పేకాట ఆడుతూ సస్సెండ్ కాగా తాజాగా ఓ టీచర్ బ్లూ ఫిల్మ్ వ్యవహారంలో సస్సెండ్ కావడంతో మండలంలోని గవర్నమెంట్ స్కూల్లలో అసలుం ఏం జరుగుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఉన్నాతాధికారుల పర్యవేక్షణ తీరుకు అద్దం పడుతుందనే విమర్శలు విన్పిస్తున్నాయి.