ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో వలన మనస్తాపం చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహ త్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బాబాపూర్ లోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు సరస్వతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉపాధ్యాయుల బదిలీల కేటాయింపుల్లో సరస్వతి కామారెడ్డి జిల్లా గంగాధర మండలం మర్ల కుంటతండ కు బదిలీ అయింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మ హత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
previous post