పోలీసు అమరవీరుల దినోత్సవంలో భాగం గా ములుగు జిల్లా కేంద్రంలో ఈరోజు రక్త దాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో బరిగలపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు కొత్త పల్లి పోషన్న 23 వ సారి రక్త దానం చేశారు.
ఈ సందర్భంగా ASP సాయి చైతన్య, CI దేవెందర్ రెడ్డి, SI హరికృష్ణ, వెంకటాపుర్, తాడ్వాయి SIలు పాల్గొన్నారు. కొత్త పల్లి పోషన్నను శాలువా తో సన్మానించి అభినందనలు తెలియజేశారు.
ప్రాణ దానం తో సమానమైన రక్త దానం చేయడం మరువలేనిది అని ASP తెలిపారు. ఇన్ని సార్లు రక్త దానం చేయడం గొప్ప విషయం అన్నారు.
ఈ కార్యక్రమం లో చుంచు రమేష్, దొంతి రెడ్డి ప్రతాప్ రెడ్డి, ముక్కు సుబ్బారెడ్డి పాల్గొన్నారు.