పిల్లలకి విద్య బుద్దులు నేర్పి, సమాజంలో మంచి మార్గంలో పయనించే విధంగా తీర్చిదిద్దే మహోన్నతమైన వ్యక్తే ఉపాధ్యాయుడని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
ఈ రోజు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం, ఈడ్పుగల్లు జడ్పీహెచ్ స్కూల్ ల్లో ఏర్పాటు చేసిన T.N.U.S సంఘం రాష్ట్ర అధ్యక్షులు చండ్ర కృష్ణ మోహన్ రావు ఉద్యోగ విరమణ సభలో ముఖ్య అతిధిగా పాల్గొని ఆయన ప్రసంగించారు.
ఈ సందర్బంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా గౌరవ ప్రదమైనదని, ఎందుకంటే పిల్లల్ని డాక్టర్స్, ఇంజినీరింగ్, లాయర్ ఇలా అనేక విధాలుగా చూడాలని తల్లిదండ్రులు కలలు కంటారని ఆ కలల్ని సాకారం చేసి వారిని ఉన్నత స్థితిలో నిలబెట్టేది ఉపాధ్యాయులని అన్నారు.
అందుకే తల్లి,తండ్రి తరువాత గురువు అంటారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అలాగే కృష్ణ మోహన్ తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శి గా గత 7 సంవత్సరాలుగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
కార్యక్రమంలో టీచర్స్ ఎమ్మెల్సీ కల్పలత, తెలుగు నాడు సంఘం యూనియన్ నాయకులు వాసు, వెంకట రత్నం, శ్రీనివాస్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.