37.2 C
Hyderabad
March 28, 2024 19: 40 PM
Slider కృష్ణ

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే మహోన్నతుడే ఉపాధ్యాయుడు

#rajendraprasad

పిల్లలకి విద్య బుద్దులు నేర్పి, సమాజంలో మంచి మార్గంలో పయనించే విధంగా తీర్చిదిద్దే మహోన్నతమైన వ్యక్తే  ఉపాధ్యాయుడని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

ఈ రోజు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం, ఈడ్పుగల్లు జడ్పీహెచ్ స్కూల్ ల్లో ఏర్పాటు చేసిన  T.N.U.S  సంఘం రాష్ట్ర అధ్యక్షులు చండ్ర కృష్ణ మోహన్ రావు ఉద్యోగ విరమణ సభలో ముఖ్య అతిధిగా పాల్గొని ఆయన  ప్రసంగించారు.

ఈ సందర్బంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా గౌరవ ప్రదమైనదని, ఎందుకంటే పిల్లల్ని డాక్టర్స్, ఇంజినీరింగ్, లాయర్ ఇలా అనేక విధాలుగా చూడాలని తల్లిదండ్రులు కలలు కంటారని ఆ కలల్ని సాకారం చేసి వారిని ఉన్నత స్థితిలో నిలబెట్టేది ఉపాధ్యాయులని అన్నారు.

అందుకే తల్లి,తండ్రి తరువాత గురువు అంటారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అలాగే కృష్ణ మోహన్ తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శి గా గత 7 సంవత్సరాలుగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

కార్యక్రమంలో టీచర్స్ ఎమ్మెల్సీ కల్పలత, తెలుగు నాడు సంఘం యూనియన్ నాయకులు వాసు, వెంకట రత్నం, శ్రీనివాస్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Related posts

రేపటి బంద్ కేసీఆర్ కు చెంపపెట్టు లాంటిది

Satyam NEWS

గేదెకు కుక్క కాటు: భయంతో టీకాలు వేసుకున్న 300 మంది

Bhavani

11వ PRC సూచించిన కనీస వేతనం తక్షణమే అమలు చేయాలి

Satyam NEWS

Leave a Comment