ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొల్లాపూర్ పట్టణ MEO కార్యాలయ ఆవరణలో ఉన్న భారతరత్న డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి మున్సిపల్ చైర్ పర్సన్ రఘుప్రోలు విజయలక్ష్మి చంద్రశేఖరచారి నివాళులు అర్పించారు.
విద్యారంగానికి అమితమైన ప్రాధాన్యమిస్తూ తెలంగాణ విద్యార్థుల భవితను బంగారుమయం చేయాలన్న సిఎం కేసీఆర్ సంకల్పానికి కార్యరూపమిస్తున్న ఉపాధ్యాయ లోకానికి చైర్ పర్సన్ ఈ సందర్భంగా వందనాలు తెలిపారు.
చైర్ పర్సన్ తో పాటు మార్కెట్ కమిటి చైర్మన్ నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు బరిగెల రాముడు యాదవ్, కృష్ణమూర్తి, పబ్బ హైమవతి ఎల్లగౌడ్, ఉపాధ్యాయులు తదితరులు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ కు నివాళులు అర్పించారు.