27.7 C
Hyderabad
April 25, 2024 10: 30 AM
Slider నల్గొండ

ఉపాధ్యాయులు ఆంగ్ల భాషపై పట్టు సాధించాలి

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మఠంపల్లి మండల ఉపాధ్యాయులకు ఆంగ్లం పై జరిగిన రెండు బ్యాచ్ లో భౌతిక శిక్షణా కార్యక్రమం శుక్రవారం తో ముగిసిందని కోర్సు కో- ఆర్డినేటర్లు మఠంపల్లి మండల విద్యాశాఖాధికారి ఛత్రునాయక్,హుజూర్ నగర్ మండల విద్యాశాఖాధికారి సైదా నాయక్ తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు అందరూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రవేశ పెట్టబోతున్న ఆంగ్ల విద్యా బోధనను విజయవంతం చేయాలని కోరారు. ఉపాధ్యాయులు నేర్చుకున్న అంశాలను ఆన్ లైన్ లో ఇచ్చే శిక్షణా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి సర్టిఫికెట్లు విధిగా పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు బీరెల్లి శ్రీనివాస్ రెడ్డి,నలబోలు శ్రీనివాసరెడ్డి,జిల్లా ఆఫీసర్స్ పర్సన్ చేపూరి నరసింహారావు, శ్రవంతి, కమల, జయరామ్,హరిణి శ్రీనివాస్,సి ఆర్ పి లు సైదులు,బ్రహ్మం, రమేష్,ఎం ఐ ఎస్ సమీనా ఉపాద్యాయులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

13న ఎంఎల్సీ ఎన్నిక పోలింగ్… జాగ్రత్తగా విధులు నిర్వర్తించండి…!

Satyam NEWS

సకల వసతులతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల

Satyam NEWS

ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాసరావు

Satyam NEWS

Leave a Comment