సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మఠంపల్లి మండల ఉపాధ్యాయులకు ఆంగ్లం పై జరిగిన రెండు బ్యాచ్ లో భౌతిక శిక్షణా కార్యక్రమం శుక్రవారం తో ముగిసిందని కోర్సు కో- ఆర్డినేటర్లు మఠంపల్లి మండల విద్యాశాఖాధికారి ఛత్రునాయక్,హుజూర్ నగర్ మండల విద్యాశాఖాధికారి సైదా నాయక్ తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు అందరూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రవేశ పెట్టబోతున్న ఆంగ్ల విద్యా బోధనను విజయవంతం చేయాలని కోరారు. ఉపాధ్యాయులు నేర్చుకున్న అంశాలను ఆన్ లైన్ లో ఇచ్చే శిక్షణా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి సర్టిఫికెట్లు విధిగా పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు బీరెల్లి శ్రీనివాస్ రెడ్డి,నలబోలు శ్రీనివాసరెడ్డి,జిల్లా ఆఫీసర్స్ పర్సన్ చేపూరి నరసింహారావు, శ్రవంతి, కమల, జయరామ్,హరిణి శ్రీనివాస్,సి ఆర్ పి లు సైదులు,బ్రహ్మం, రమేష్,ఎం ఐ ఎస్ సమీనా ఉపాద్యాయులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్