టీ20 ప్రపంచకప్లో టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. అత్యధిక బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించిన మూడో జట్టుగా భారత్ నిలిచింది. స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో 81 బంతులు మిగిలి ఉండగానే భారత్ టార్గెట్ను ఫినిష్ చేసింది.
టీ20 ప్రపంచకప్ -2014లో 90 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించిన శ్రీలంక మొదటి స్ధానంలో ఉండగా, టీ20 ప్రపంచకప్- 2021లో బంగ్లా దేశ్పై 82 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించిన ఆస్ట్రేలియా రెండో స్ధానంలో నిలిచింది.