ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖలోని సర్వర్ లో సాంకేతిక సమస్య కారణంగా రవాణాశాఖ అందించే అన్నిసేవలకు అంతరాయం కలిగింది. సాంకేతిక సిబ్బంది సహాయంతో ఆ సమస్యను పరిష్కరించి శుక్రవారం ఉదయానికి సేవలను పునరుద్ధరించే దిశగా కృషి చేస్తున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ కమీషనర్ టిఎస్ఆర్ ఆంజనేయులు తెలియజేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే డీలర్లు అందరికీ తెలియజేయడం జరిగిందని ఆయన తెలిపారు. సాంకేతిక సమస్య పరిష్కారం కాగానే శుక్రవారం ఉదయం నుండి రవాణా శాఖలో వాహనాల రిజిస్ట్రేషన్లు యథావిధిగా అనుమతిస్తామని కమీషనర్ ఆంజనేయులు తెలియజేశారు.