ఇంత కాలం కేవలం పార్టీలో చేరడం తప్ప నిష్క్రమణలు లేకుండా కాలం గడిపిన టీఆర్ఎస్ లో ఇప్పుడు బయటకు వెళ్లే వారు కూడా రెడీ అవుతున్నారు. సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు తీగల కృష్ణారెడ్డి బిజెపిలో చేరేందుకు సిద్ధపడటంతో ఇప్పుడు బుజ్జగింపు కార్యక్రమాలకు టీఆర్ఎస్ తెరతీసింది.
మంత్రి మల్లారెడ్డి తీగల కృష్ణారెడ్డిని అనునయించేందుకు మీర్ పేట్ లోని టీఆర్ఆర్ కాలేజీకి చేరుకున్నారు. తీగల కృష్ణారెడ్డి గత కొంతకాలంగా టీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నారు. ఎన్నికలలో ఓడిపోవడం ఆ తర్వాత ఆయనపై గెలిచిన సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎల్ లో చేరి మంత్రి కావడంతో తీగల కృష్ణారెడ్డి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది దాంతో ఆయన బిజెపిలో చేరేందుకు పావులు కదిపారు.
ఈ నేపథ్యంలో తీగల కృష్ణారెడ్డితో బీజేపీ సీనియర్ నేతలు చర్చలు జరిపారు. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. టీఆర్ఎస్ అసంతృప్తులకు గాలం వేస్తోంది.