పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం వద్దకు వెళ్తున్న తీన్మార్ మల్లన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా దుబ్బపల్లి వద్ద తీన్మార్ మల్లన్నతో పాటు ఆయన అనుచరులను సుల్తానాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని జూలపల్లి పోలీస్స్టేషన్కు తరలించారు.
రామగుండం వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులతో మల్లన్న వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తుందని, పోలీసులచే అక్రమ అరెస్టులు చేయిస్తుందని ఆరోపించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏసీపీ సారంగపాణి అధ్వర్యంలో సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రదీప్కుమార్, అనిల్కుమార్, ఎస్ఐలు ఉపేందర్, లతో పాటు సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు.