తీన్మార్ మల్లన్న టీమ్ ములుగు జిల్లా కన్వీనర్ గా మొగుళ్ల భద్రయ్య ను కో కన్వీనర్ గా అచ్చునూరి కిషన్ ను నియమించారు.
తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు రాష్ట్ర కోఆర్డినేటర్ రిటైర్డ్ సి.ఐ దాసరి భూమయ్య ఈ నియామకాలు చేశారు. అదేవిధంగా రాష్ట్ర లీగల్ టీమ్ కన్వీనర్ చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కన్వీనర్ చింతపండు వెంకటేష్ ఈ కమిటీ ఎన్నికలో ప్రధాన భూమిక వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ మొగుళ్ల భద్రయ్య కోకన్వీనర్ అచ్చునూరి కిషన్ ను మాట్లాడుతూ తమను గుర్తించి నియామకాలకు కృషి చేసిన రాష్ట్ర కమిటీ బాధ్యులకు కృతజ్ఞతలు తెలియచేశారు.
ములుగు జిల్లాలో తీన్మార్ మల్లన్న టీమ్ పటిష్ఠతకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ప్రకటించారు.